మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్రఫడ్నవిస్ ఈ రోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మీడియా ఎదుట రాజీనామా ప్రకటన అనంతరం ఫడ్నవిస్ నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు.
రేపు జరగనున్న బాల పరీక్షలో ఫడ్నవీస్ తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ అంతకు ముందే నాటకీయ పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఫఢ్నవీస్ ప్రకటించారు. శివసేన తమను మోసం చేసిందని విమర్శించారు. ఇది ఇలా ఉండగా.. మహారాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్ నియామకం జరిగినట్లు సమాచారం.
కమల్ అనుచిత వ్యాఖ్యల పై కేసు నమోదు