ఆంధ్రప్రదేశ్లో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది
ఈ సందర్భంగా మంత్రులకు ఆయన కీలక సూచనలతోపాటు దిశానిర్దేశం చేశారు.


తెలుగు రాష్ట్రాలకు వీడనున్న ‘చంద్ర’ గ్రహణం: బీజేపీ నేత లక్ష్మణ్