సత్యదేవ్, ఇషారెబ్బా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీరామ్’, ఫేమ్ ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈషా రెబ్బ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కుతోంది. పలు సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసిన ఈషాకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం ఈషాకు ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఈషా లుక్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
previous post