కొండపొలం మూవీలో వైష్ణవ్ కి జంటగా రకుల్ ప్రీత్ నటించారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. లంగా ఓణీలో అమాయకంగా ఉన్న రకుల్ లుక్ 80ల నాటి పల్లెటూరి అమ్మాయిలను గుర్తు చేస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్ ఫాలో యింగ్ ఎక్కువే. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీలలో వరసపెట్టి క్రేజీ సినిమాలలో నటిస్తుంది. రకుల్ చేతిలో ప్రస్తుతం ఎనిమిది సినిమాలుండగా అందులో కొండపోలం సినిమా కూడా ఒకటి.
ఇందులో రకుల్ రాయలసీమ గొర్రెలు కాచుకునే అమ్మాయి ఓబులమ్మలా కనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల టైటిల్ పోస్టర్ తో పాటు వైష్ణవ్ లుక్ విడుదల చేశారు. కొండపొలం పేరుతో తెరకెక్కిన ఈ మూవీ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు పోస్టర్ టైటిల్ ద్వారా తెలుస్తుంది.
ఇక ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న సెకండ్ మూవీ కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెనలో చేపలు పట్టే కుర్రాడిగా నటించిన వైష్ణవ్, కొండపొలం మూవీలో పల్లెటూరి యువకుడు రోల్ చేస్తున్నారు.
కాగా, ఓబులమ్మగా రకుల్ లుక్ ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుండగా సినిమా మీద అంచనాలు పెంచేసింది. నీలో నాలో అంటూ సంగీతం కథలో డెప్త్ తెలిపేదిగా మారింది. కథా రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారి నవల ‘కొండపొలం’ ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు