telugu navyamedia
సినిమా వార్తలు

హాలీవుడ్ కు “గోదావరి” హీరోయిన్

Neetu-Chandra

తెలుగులో “గోదావరి” సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన నీతూ చంద్ర ఆ తరువాత బాలీవుడ్‌లో తన సత్తా చాటారు. అటుపిమ్మట భోజ్‌పురి సినిమాకు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ఆమె భోజ్‌పురి సినిమా ‘మిథిలా మకాన్’లో నటించి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. మరోవైపు ఇప్పుడు నీతూచంద్ర హాలీవుడ్‌లో కాలు మోపుతున్నారు. నీతూ చంద్ర కొరియన్ యూత్ యాక్షన్ డ్రామా ‘నరాఎ‘లోనూ నటిస్తున్నారు. హాలీవుడ్ షార్ట్ ఫిలిం “ది వరస్ట్”లో ఆమె కనిపించనున్నారు. ఈ సందర్భంగా నీతూ చంద్ర మాట్లాడుతూ “2019 నాకెంతో శుభప్రదంగా ప్రారంభమైంది. ఈ నూతన ప్రాజెక్టు చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది నాకు ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కానుంది. దీనిలో తొలిసారిగా నెగిటివ్ రోల్ చేస్తున్నాను. విలన్ పాత్ర చేయడంపై ఎంతో ఆసక్తిగా ఉంది. దీనిని టీవీ సిరీస్‌గానూ తీసుకురానున్నారు” అని తెలిపారు.

Related posts