ఈసీ నుంచి ఇవాళ అనుమతి రావడంతో రాష్ట్ర క్యాబినెట్ భేటీకి మార్గం సుగమమైంది.
తెలంగాణ క్యాబినెట్ భేటీకి కొన్ని షరతులు విధించింది. జూన్ 4వ తేదీ లోపు నిర్వర్తించాల్సిన అత్యవసర పనులపై మాత్రమే ఈ సమావేశంలో చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చించరాదని తేల్చిచెప్పింది.
ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.