telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ మహిళలకు శుభవార్త.. బస్సుల్లో ఉచిత ప్రయాణం!

passengers fire on tsrtc buses shortage

ఢిల్లీ మహిళలకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు అని రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోట్‌ వెల్లడించారు. ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. డీటీసీతో పాటు క్లస్టర్‌ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించొచ్చు. ఉచిత పాసులు బస్సు కండక్టర్‌ వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. ఒక వేళ ఉచితంగా ప్రయాణించడం ఇష్టం లేని మహిళలు టికెట్‌ కూడా తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు.

Related posts