ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంపై అసంతృప్తితో ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్లోని జైటో ఎమ్మెల్యే బల్దేవ్ సింగ్ ఆప్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారంపై తాను పార్టీ నుంచి వైదులుతున్నానని బుధవారం సింగ్ వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేసిన బల్దేవ్ సింగ్ తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. కేజ్రీవాల్ తీరు, ఆయన అహంకారం కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా పంజాబ్లో ఇటీవల వరుసగా నేతలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఆపార్టీ కీలక నేత సుఖ్పాల్ సింగ్ గత నవంబర్లో పార్టీకి రాజీనామా చేశారు. సుఖ్పాల్కు ప్రధాన అనుచరుడైన బల్దేవ్ సింగ్ కూడా రాజీనామా సమర్పించారు. కాగా మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్లో ఆప్ నేతల రాజీనామాలు చేయడంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారినట్లు స్పష్టమవుతోంది.
కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు