telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో నాగార్జున పొలంలో మృతదేహాం…!?

Nag

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది. షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం దొరికింది. అది కూడా పూర్తిగా కుళ్ళిపోయి… ఎముకల గూడులా ఉండటం సంచలనాలకు తావిస్తుంది. పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేశాడు నాగార్జున. సెప్టెంబర్ 10న తన వ్యవసాయ కేత్రంలో భార్య అమలతో కలిసి చెట్లు కూడా నాటాడు నాగార్జున. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇదే విషయంపై వ్యవసాయ సాగు కోసం తన పొలానికి నిపుణులను పంపారు ఆయన కుటుంబ సభ్యులు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని నిపుణులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు నిపుణులు. కుళ్లిపోయిన మృతదేహానికి అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ శవం దొరికిన గదిని సీజ్ చేసి సెప్టెంబర్ 19న అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. మరి ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related posts