తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు.
నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి తాను రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు.
కుటుంబ కార్యక్రమాల్లో చంద్రబాబు, దగ్గుబాటి కలుసుకుంటున్నా చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారి.
దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరు కానున్నారు.
కాగా, మార్చి 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.


చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారు: లక్ష్మీపార్వతి