మల్కాజ్గిరి లోక్సభ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా రేవంత్ రెడ్డి 6270 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ పై నమ్మకంతో ఆయనకు మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి విజయం సాధించారు.
దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది: రాహుల్