హైదరాబాద్ను లైఫ్ సైన్సెస్కు ప్రపంచ రాజధానిగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
సోమవారం రాయదుర్గంలోని రహేజా నాలెడ్జ్ సిటీలో ఆమ్జెన్ ఇండియా నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తుందని ఉద్ఘాటించారు.
హైదరాబాద్ను వైద్యరంగంలో నంబర్వన్ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
“నగరం ఇప్పటికే వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది, హైదరాబాద్ బ్రాండ్ను మరింత ఉన్నతీకరించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు అనేక ప్రపంచ దిగ్గజాలను పెట్టుబడులు పెట్టడానికి మరియు ఇక్కడ తమ కార్యాలయాలను స్థాపించడానికి ఆకర్షించాయి,” అన్నారాయన.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి)లకు హైదరాబాద్ హబ్గా ఆవిర్భవించిందని, నైపుణ్యం కలిగిన మానవ వనరుల శక్తి కేంద్రంగా నిలిచేందుకు తెలంగాణ చురుగ్గా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
“దీనిని సాధించేందుకు, తెలంగాణ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక కోర్సులను రూపొందించడానికి పరిశ్రమలతో సహకరించే నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రం ఏర్పాటు చేసింది” అని ఆయన వెల్లడించారు.
తెలంగాణ చురుకైన ప్రయత్నాలే యామ్జెన్ను ఏడాది క్రితం హైదరాబాద్లో తన కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు ఒప్పించాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ క్యాంపస్లోని ఉద్యోగుల సంఖ్య ఈ సంవత్సరం చివరి నాటికి 600కి చేరుకుంటుంది మరియు రాబోయే సంవత్సరాల్లో 2,000 మంది నిపుణులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో బయోటెక్నాలజీ ప్రతిభను పెంపొందించడంలో ఆమ్జెన్ ఉనికి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.
ఆవిష్కరణలు మరియు నైపుణ్యాల అభివృద్ధికి తెలంగాణ విశ్వవిద్యాలయాలు, స్టార్టప్లు మరియు పరిశోధనా సంస్థలతో సహకరించాలని ఆయన కంపెనీని కోరారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆమ్జెన్ చైర్మన్ & సీఈఓ రాబర్ట్ ఎ. బ్రాడ్వే, యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఆమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ మరియు ఆమ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా