telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

క‌శ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి

army jawan kidnaped in jammu kashmir

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరు జరుగుతుండగా జ‌మ్ముక‌శ్మీర్‌లో మాత్రం ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జవాన్ల శిభిరాలే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179 బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ఉన్న చెక్‌పోస్ట్‌పై ఉగ్ర‌వాదుల‌కు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గ‌రు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో మ‌రికొంద‌రు జ‌వాన్లు, పోలీసులు గాయ‌ప‌డ్డారు. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో ఉగ్ర‌వాదులు భార‌త పారా మిలిట‌రీ బ‌ల‌గాలే ల‌క్ష్యంగా దాడుల‌కు పాల్ప‌డ‌టం ఇది మూడోసారి. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు జ‌రిపి పారిపోయిన ఉగ్ర‌వాదుల కోసం పోలీసులు కూంబింగ్ చేపట్టారు.

Related posts