telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గీతం భూముల విషయంలో కౌన్సిల్ తప్పు చేయలేదు: విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు

తనపై దాడి ప్రయత్నం వెనుక మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పాత్ర ఉందని భావిస్తున్నాను అని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు.

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీరు బాగోలేదని ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

తన మీద దాడి చేయడానికే వైసీపీ సభ్యులు కౌన్సిల్‌కు వచ్చారని తెలిపారు. తనపై ముగ్గురు వైసీపీ సభ్యులు దాడికి ప్రయత్నం చేశారని అందుకే వారిని సస్పెండ్ చేశామని చెప్పుకొచ్చారు.

మేయర్ పోడియం మీదకి దూకి తనపై దాడికి ప్రయత్నించారని దాడి చేసిన వారిలో వైసీపీ డిప్యూటీ మేయర్ సతీశ్ కూడా ఉన్నారని తెలిపారు.

తనపై దాడి ప్రయత్నం వెనుక బొత్స పాత్ర ఉందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. బొత్సకు జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యత్వం లేదని అన్నారు.

వైసీపీ వాళ్లు మేయరైన తనను టార్గెట్ చేశారన్నారు. వారు టార్గెట్ చేయాల్సింది సబ్జెక్టును అని హితవు పలికారు.

గీతం భూముల విషయంలో కౌన్సిల్ తప్పు చేయలేదని పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Related posts