కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గదని, వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని తెలిపింది. జనసంచారం మళ్లీ పెరగడంతోపాటు గ్రామాలకు కూడా వైరస్ వ్యాపించిందని తెలిపారు.
కరోనా పరీక్షలు పెంచిన కారణంగా వచ్చే ఏడాది కూడా వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని ఎయిమ్ డైరెక్టర్, భారత్ కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. కేసుల వేగం పెరిగిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించారు.
ఒక నిర్దిష్ట రేటులో కొంతకాలం పాటు వైరస్ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి రెండో దశకు చేరిందన్న ఆయన.. వచ్చే ఏడాది కేసులు పెరిగే వేగం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే