telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

యశోద ఆసుపత్రిలో కరోనా బాధితుడు ఆత్మహత్య

Crime

హైద్రాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా చికిత్స పొందుతున్న బాధితుడు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో బాత్ రూమ్‌లోని షవర్‌కి పేషెంట్ వేసుకునే గౌన్‌తోనే ఉరి వేసుకున్నాడు. మృతునికి మరోసారి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts