కరోనా నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా పరిస్థితిని మోదీకి సీఎం కేసీఆర్ వివరించారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని ఆయన చెప్పుకొచ్చారు. మనకు కరోనా వ్యాప్తి పై అనుభవం లేదని, ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని ఆయన చెప్పారు. గతంలో అనేక వైరస్లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని, కరోనా వంటి వైరస్ రాలేదని కేసీఆర్ చెప్పారు.
కొవిడ్-19 వంటి వైరస్లు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, ఏ విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యుల సంఖ్యను పెంచాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వైరస్ల వంటివి ఎన్ని వచ్చినా తట్టుకునేలా వైద్య రంగం సిద్దం కావాలని కేసీఆర్ వివరించారు.
తిత్లీ తుపాను హామీ మర్చిపోయారా జగన్ గారూ: లోకేశ్