హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కావడంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చారు.
హుజూర్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణిని బరిలోకి దించితే గెలుపు తథ్యమని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, కేసీఆర్ నిరంకుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రానికే ఒక మార్గనిర్దేశకంగా ఉండాలని జగ్గారెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.