telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రెండో విడత బడ్జెట్ సమావేశాలు…

Parliament

ఈరోజు నుండి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు బడ్జెట్ సెషన్ కొనసాగనుంది… ఇక, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నందున.. ఎంపీల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. మరోవైపు.. పెరుగుతున్న పెట్రో ధరలపై పార్లమెంట్ ఉభయసభలలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. భావసారూప్య పార్టీలను సంప్రదించి ఉమ్మడి పోరుకు సన్నద్దమవుతున్నారు. ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలకు చెందిన ఎంపీలు సమావేశాలకు గైరుహాజరయ్యే అవకాశం ఉంది. అలాగే పెట్రో ధరలను ఎందుకు నియంత్రించలేకపోతున్నామో.. పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది… పెరుగుతున్న పెట్రో ధరలపై ఉభయ సభలలో చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.. ఇక, వివిధ శాఖల పద్ధులు, ఫైనాన్స్ బిల్లు ఆమోదంపై దృష్టి సారించింది సర్కార్. చూడాలి మరి ఈరోజు సమావేశాల్లో ఏం జరుగుతుంది అనేది.

Related posts