telugu navyamedia
రాజకీయ వార్తలు

సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కారు!

Kamal_Nath mp

మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్  ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా 17 మంది ఎమ్మెల్యేలతో అదృశ్యమయ్యారు. ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు ఉండడం గమనార్హం. ఆచూకీ లేకుండా పోయిన అందరి ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. వీరందరూ బెంగళూరులో మకాం వేసినట్టు చెబుతున్నారు.

సంక్షోభంలో పడిన సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సీఎం కమల్‌నాథ్ చర్యలు ప్రారంభించారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి బుజ్జగించాలన్న ఉద్దేశంతో 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు.

మరోవైపు సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్వత్వం తీసుకుంటారని, అనంతరం మంత్రి పదవి కూడా చేపడతారన్న వార్తలు నిన్నంతా షికారు చేశాయి. మరోవైపు, సింధియాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.

Related posts