telugu navyamedia
వార్తలు సామాజిక

నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు

colnal santosh kumar

భారత్-చైనా సరిహద్దు లడఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు నేడు సైనిక లాంఛనాల మధ్య జరగనున్నాయి. నిన్ననే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, పార్థివదేహం ఆలస్యంగా సూర్యాపేటకు చేరుకోవడంతో అంత్యక్రియలు నేడు నిర్వహించాలని నిర్ణయించారు. కేసారంలో సంతోష్‌బాబు కుటుంబానికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

క‌ల్న‌ల్ పార్థివ‌దేహాన్ని ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సూర్యాపేట‌లోని ఆయ‌న నివాసంలో ఉంచనున్నారు. పార్థివ దేహాన్ని సందర్శించే క్రమంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం కేసారం గ్రామంలో క‌ల్న‌ల్ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు. అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు బుధ‌వారం సాయంత్రమే ఆర్మీ జనరల్ మేజర్లతోపాటు ప‌లువురు ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేట‌కు చేరుకున్నారు.

Related posts