నిన్న జరిగిన (ఐరాస) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఓటింగులో పాల్గొనగా, భారత్కు అనుకూలంగా 184 దేశాలు ఓటేశాయి. ఫలితంగా ఆసియా-ఫసిఫిక్ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా భారత్ మరోమారు ఎన్నికైంది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది
భారత్ ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. 2021-22 కాలానికి భారత్ను ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నట్టు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. కాగా, భారత్తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. అలాగే భారత్ గతంలో 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992, 2011-12లలో విజయం సాధించింది.