telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోదావరి నదీజలాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

KCR cm telangana

గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. .ఉదయం 11 తర్వాత ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశంలో గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో ఎంత నీరు విడుదల చేయాలి? తదితర అంశాలపై ఈసమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లాభాలను పొందేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, అధికారులు హాజరయ్యారు.

Related posts