గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. .ఉదయం 11 తర్వాత ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశంలో గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో ఎంత నీరు విడుదల చేయాలి? తదితర అంశాలపై ఈసమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లాభాలను పొందేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, అధికారులు హాజరయ్యారు.