telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు తహసీల్దార్‌ విజయారెడ్డి.. అంత్యక్రియలు.. చల్లారని అధికారుల నిరసనలు..

mro cremation today in nagole

ఓ దుండగుడు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నేడు విజయా రెడ్డి అంత్యక్రియలు నాగోలులో జరగనున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు నాగోల్‌ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఎల్బీనగర్‌లోని ఇంటికి తరలించారు. విజయా మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు. తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌, అటెండర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. మంటల్ని ఆర్పే క్రమంలో డ్రైవర్‌ కామల్ల గురునాథానికి 85%, అటెండర్‌ చంద్రయ్యకు 40% గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స అందించేందుకు వారిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో గరునాథ్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది

Related posts