telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విరాట్-అనుష్క దాంపత్య జీవితానికి మూడేళ్లు…

చాలా రోజులు ప్రేమ అనే మత్తులో మునిగితేలిన విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దాంపత్య జీవితం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఏ సందర్బంగా భారత కెప్టెన్ విరాట్ ట్విట్టర్ లో తన పెళ్లి నటి ఫోటో షేర్ చేస్తూ.. మూడేళ్ళుగా… ఇంకా జీవితాంతం” అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఇటలీలో డిసెంబర్ 11, 2017 న పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఈ మధ్యే అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. అదేంటంటే… వచ్చే ఏడాది జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఈ మధ్యే ఈ జంట తెలిపింది. అయితే కరోనా అనంతరం జరిగిన ఐపీఎల్ 2020 కోసం కోహ్లీ దుబాయ్ వెళ్లగా అనుష్క కూడా అక్కడికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత భారత జట్టుతో కలిసి ఆసీస్ పర్యటనకు కోహ్లీ వెళ్తే అనుష్క మాత్రం భారత్ కు తిరిగి వచ్చేసింది. అయితే తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ విశిష్టమైన రోజున విరాట్ అక్కడ ఆసీస్ లో ఉంటె అనుష్క ఇంటా భారత్ లో ఉంది.

Related posts