విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు కూడా సిద్ధం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం తెగేసి చెప్పేసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్ మరో లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇస్తేనే తగిన గుర్తింపు వస్తుందని తెలిపారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతున్న సందర్భంలో జాతీయ పతాక రూపశిల్పికి భారత రత్న ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. గాంధీ సిద్దాంతాలతో స్వాతంత్ర్య పోరాటం చేసిన పింగళిని భారత రత్నతో సత్కరించాలని కోరారు. పింగళి వెంకయ్యకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదని..సీఎం జగన్ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే విశాఖ స్టీల్ప్లాంట్ పై ప్రధాని మోడీకి జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే.