telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సోమశిలలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..

ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు.

రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే జలాశయంగా చేయగలిగితే నీటి సమస్యే ఉండదు, రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు.

ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, అంధ్రప్రదేశ్‍లోనే వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చింది, మొత్తం రిజర్వాయర్లలో 983 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు,  రాష్ట్రంలో ఇప్పటివరకు 692 టీంసీలు నిల్వ చేసుకున్నాం.

20 ఏళ్ల తర్వాత ఏపీలో ఆగస్టులో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి, వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, 70 శాతం ప్రాజెక్టుల్లో నీళ్లు వచ్చాయి.

నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత, డబ్బులివ్వకపోతే కాంట్రాక్టర్ పనిచేస్తారా? గేటు పెట్టలేని ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది.

ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వమిది కష్టాలున్నా.. ఖాళీ ఖజనా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యత మాది. పాత రోజులు మరిచిపోవాలని అందరికీ చెబుతున్నా.

బాధ్యతగా పనిచేయాలి సకాలంలో పనులు పూర్తిచేయాలి – గత ప్రభుత్వంలో సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు ఖర్చుపెట్టారు.

పేపర్లకు ప్రకటనలు కోసం రూ.403 కోట్లు ఖర్చు పెట్టారు  ఈ డబ్బుల్లో రూ.200 కోట్లు ఖర్చుపెట్టినా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి, రుషికొండ కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారు, తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే వెంటనే ఇంజినీర్‍గా పంపాం.

కర్ణాటకు మన మంత్రులు వెళ్లి మాట్లాడారు మన వద్ద ఉన్న ఇంజినీర్ కన్నయ్యనాయుడును పంపాం మూడు, నాలుగు రోజుల్లోనే గేటు పెట్టి నీటిని నిల్వచేయగలిగాం : సీఎం చంద్రబాబు

Related posts