telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

నూజివీడు లో ఘర్షణ.

ఏలూరు జిల్లా నూజివీడు లో గురువారం YSRCP, TDP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ లో ఇద్దరికి కత్తిపోట్లు.

నూజివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ, YSRCP కి చెందిన కౌన్సిలర్‌ ఎన్‌.గిరీష్‌ గాంధీ విగ్రహం సెంటర్‌ సమీపంలో చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.

TDP కి చెందిన నూకల సాయికిరణ్ కూడా అక్కడే చికెన్ దుకాణం నడుపుతున్నాడు.

గురువారం వారిద్దరూ కోడి కత్తులతో ఘర్షణ పడి గాయాలపాలయ్యారు.

గాయపడిన గిరీష్ విజయవాడ ప్రభుత్వాసుపత్రి లో, సాయికిరణ్ ఏలూరు ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

రాజకీయాల వల్ల గొడవలు జరగవని నూజివీడు DSP జి.లక్ష్మయ్య అన్నారు.

గిరీష్ మరియు సాయి కిరణ్ ఇద్దరూ ఆగస్టు 2023 నుండి చికెన్ షాపులను నడుపుతున్నారని, వారి వ్యాపార పోటీ కారణంగా వారు గొడవపడుతూనే ఉన్నారని ఆయన వివరించారు.

గిరీష్‌ పై రౌడీషీట్ కూడా తెరిచారు.

మరిన్ని ఘర్షణలు జరగకుండా పట్టణంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు DSP జి.లక్ష్మయ్య తెలిపారు.

Related posts