telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏబీఎన్ రాధాకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం : చిరంజీవి, పవన్ భావోద్వేగం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేమూరి కనకదుర్గ.. ఇవాళ మృతి చెందారు. అయితే వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. తాజాగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సంతాపాన్ని తెలిపారు. “ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ సంస్థ‌ల ఎమ్‌.డి.. జ‌ర్న‌లిస్ట్.. సంపాద‌కులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమ‌ణి శ్రీ‌మ‌తి క‌న‌క‌దుర్గ గారు తుదిశ్వాస విడిచార‌ని తెలిసి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త  నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తి ని ఆ భగవంతుడు ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ  కుటుంబమంత‌టికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. ” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. అటు “”ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ సంస్థ‌ల ఎమ్‌.డి.. జ‌ర్న‌లిస్ట్.. సంపాద‌కులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమ‌ణి శ్రీ‌మ‌తి క‌న‌క‌దుర్గ గారు తుదిశ్వాస విడిచార‌ని తెలిసి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Related posts