కేంద్ర నిధులపై తెలంగాణ మంత్రులకు ఏ మాత్రం అవగాహనే లేదని బాబు మోహాన్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కాన్సాన్ పల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి బాబుమోహన్. ఈ సందర్భంగా బాబుమోహన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయిస్తున్న ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడం లేదు అనడం ఈ రాష్ట్ర మంత్రుల అవగాహన రాహిత్యమన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న 161వ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి 12 వందల కోట్లు కేటాయించింది కేంద్రమేన్నారు. స్వచ్చ భారత్ నిధులు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ఘనత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. జోగిపేట హెడ్ క్వార్టర్ ను హైదారాబాద్ రేంజ్ లో అభివృద్ధి చేయాలనుకున్న తన కలను కేసీఆర్ పటా పంచలు చేశారని మండి పడ్డారు. రైతులుకు చెక్ పోస్టుల వద్ద టోల్ రుసుము, మార్కెట్ ఎంట్రీ ఫీజులు మాఫీ చేసిన ఘనత కేంద్రానిదేనని కొనియాడారు.
previous post
టీటీడీకొచ్చే ఆదాయంపై ..టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు