*ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు..
*సోదాల్లో అధికారుల ప్రశ్నలకు మీడియాకు సమాధానం చెప్పాను..
*రేపు ఈడీకి సమాధానం చెబుతాను..
*అధికారులకు సందేహాలు ఉన్నాయి.. అందుకే వివరణ అడిగారు
*నేను లీగల్ వ్యాపారమే చేశాను..
*గోవా, నేపాల్లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించాం..
క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు.
తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగలే అని చెప్పుకొచ్చారు. గోవా, నేపాల్లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని అన్నారుసాధారణ సోదాల్లో భాగంగానే ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు.
సాధారణ వ్యక్తి అయిన మిమ్మల్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసిందని విలేకరులు ప్రశ్నించగా, క్యాసినోపై ఈడీ అధికారులకు ఏదో డౌట్ వచ్చి ఉంటుందని, అందుకే తనిఖీలు చేసుకుంటున్నారని అన్నారు.
మనీలాండరింగ్ లాంటి ఆరోపణలు ఏం ఉన్నా తాను సమాధానం చెప్పుకుంటానని అన్నారు. ఏం చెప్పుకోవాలన్నా తాను ఈడీ అధికారులకే సమాధానం చెప్పుకుంటానని, మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీడియాను ఉద్దేశించి అన్నారు.
తన నుంచి అధికారులు ఏమీ సీజ్ చేయలేదని అన్నారు. నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు. రేపు వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
ముస్లింలు సొంతంగా రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలి: ఒవైసీ పిలుపు