telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ విజయలక్ష్మి, షర్మిల కు.. సమన్లు జారీ..

ys sharmila press meet

2012 నాటి కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీసీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వారితో పాటు ఏ3, ఏ4లుగా ఉన్న అప్పటి పరకాల వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. వీరందరూ ఈనెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది.

ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాల పోలీస్‌స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. మరో పక్క ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ కూడా అదే రోజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంది.

Related posts