కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. వైద్యుడి ప్రాణాలను కూడా కాపాడలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని అన్నారు. తెనాలి ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తూ కరోనా బారిన పడిన డాక్టర్ చికిత్స అందించి బతికించాలని వేడుకున్నా బతికించలేకపోయారని విమర్శించారు.
తమకు మర్యాద లేని చోట పనిచేయలేమంటూ చీఫ్ సెక్రటరీకి వైద్యుల సంఘం లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. సమీక్ష సమావేశానికి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు ప్రశాశం జిల్లా డీఎంహోచ్ఓను నిల్చోబెట్టారని మండిపడ్డారు. ఇదే విధంగా అనంతపురం డీఎంహెచ్ఓను వ్యక్తిగతంగా దూషించారని అన్నారు.

