telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

“అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి.

మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దాం!”  అని సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా నివాళులు  తెలిపారు.

Related posts