దీపావళి పండగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను కొనుగోలు చేసిన వారికి 15 శాతం క్యాష్బ్యాక్తోపాటు మరో పదిశాతం అదనపు రాయితీని ఆ సంస్థ కల్పించింది.
అలాగే లక్కీ డ్రా ద్వారా కిలో బంగారాన్ని, లగ్జరీ కార్లు, మోటార్సైకిల్, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్టాప్స్ లేదా ఐఫోన్లను గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నది.ఈ లక్కీ డ్రా తమిళనాడుకు వర్తించదని వెల్లడించింది.