telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

రిలయన్స్‌ డిజిటల్‌ బంపర్ ఆఫర్‌.. 15 శాతం క్యాష్‌బ్యాక్‌!

reliance digital kg gold offer

దీపావళి పండగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్‌ డిజిటల్‌ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లలో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన వారికి 15 శాతం క్యాష్‌బ్యాక్‌తోపాటు మరో పదిశాతం అదనపు రాయితీని ఆ సంస్థ కల్పించింది.

అలాగే లక్కీ డ్రా ద్వారా కిలో బంగారాన్ని, లగ్జరీ కార్లు, మోటార్‌సైకిల్‌, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్స్‌ లేదా ఐఫోన్లను గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నది.ఈ లక్కీ డ్రా తమిళనాడుకు వర్తించదని వెల్లడించింది.

Related posts