ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ముందుజాగ్రత్తలో భాగంగా నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఆగస్టు 14 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వరకు నమోదవుతున్నాయి. అయితే, అయితే మరోసారి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
previous post
మా పార్టీలో కొంతమంది నాపై కుట్ర చేస్తున్నారు ..వాళ్ళ అంతు చూస్తా