telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూను మ‌రోసారి పొడిగించారు. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ కర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. ఆగ‌స్టు 14 వ తేదీ వ‌ర‌కు ఈ నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వ‌ర‌కు న‌మోదవుతున్నాయి. అయితే, అయితే మరోసారి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండటంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.

Related posts