రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు సామాన్యుడిగా ఉన్నట్లే కలెక్టర్లు కూడా ప్రజలతో సామాన్యులు గా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఎవరైనా ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించాలని కలెక్టర్లకు సూచించారు. ఎల్లప్పుడూ రూల్స్ అంటూనే కాకుండా మానవీయ కోణంలో కూడా ఆలోచించి అధికారులు పనిచేయాలన్నారు.
ఇదిలా ఉండగా ఈనెల 15, 16 తేదీల్లో మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం కానున్నారు.
ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ లకు దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే రెండు రోజుల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన పూర్తి చేశారు.
ఈ సమావేశంలో ఏడాదిన్నర పాలన విధివిధానాల అమలు తీరుపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రతి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ప్రయోజనాలు, జిల్లాల వారీ అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే భావనతో సీఎం చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు.


వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స