ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయడు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు చిన్న ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసుకున్నఅభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు.
గుంటూరులో అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అధికారులు నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ తేల్చిచెప్పింది. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని జైళ్లశాఖ అధికారులు తెలిపారు. అలాగే చంద్రబాబు మరో వినతిపై జిజిహెచ్ హాస్పటల్ సూపరింటెండెంట్ స్పందించారు. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూపరింటెండెంట్ సూచించారు.
లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు: రేవంత్రెడ్డి