మెగా హీరో సాయిధరమ్ తేజ్ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే సాయిధర్మ్ తేజ్కు ప్రాణాపాయం లేదని., ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, నేడు కూడా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. షోల్డర్ బొన్ విరిగినట్టు, ఆర్గాన్ డామేజ్ ఏమి లేదని , 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని శనివారం హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.
ఇదిలా ఉండగా సాయి ధరమ్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు చెప్పారు. బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున ఐపీసీ సెక్షన్ 336 మరియు 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.
ఈ లాక్డౌన్ వనితలను వణికిస్తోంది : వరలక్ష్మి శరత్ కుమార్