బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ లు హీరో హీరోయిన్ లుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా ‘బ్రహ్మాస్త్ర’ .
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ శుక్రవారం రిలీజ్ అయ్యింది.
కంటెంట్ లో దమ్ము లేదని, అసలు కథ ఇందులో లేదంటూ చాలా వరకు అసంతృప్తి వ్యక్తమయ్యింది. కానీ విజువల్గా అద్భుతంగా ఉందంటూ క్రిటిక్స్, ఆడియెన్స్ సైతం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమా డిజాస్టర్గా ప్రకటించారు..
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9 వేలకు దగ్గర స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ `బ్రహ్మాస్త్ర` వాటన్నింటిని బ్రేక్ చేసింది.
ఈ చిత్రం వరల్డ్ వైడ్ మొదటి రోజు 75 కోట్ల భారీ గ్రాస్ ని రాబట్టిందట. దీనితో మేకర్స్ ఆడియెన్స్ ని థాంక్స్ చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది మరో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
మొత్తానికి అయితే ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లనే సాధించింది అని చెప్పాలి. మరి వారాంతానికి అయితే ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.
You all painted cinema halls #Kesariya with your fiery love for #Brahmastra!🔥
Thank you for this love♥️
Book your tickets now –
BMS – https://t.co/qDufXPK4SQ
Paytm – https://t.co/vXZR7oqNLT pic.twitter.com/DzfNNkd2iv— Dharma Productions (@DharmaMovies) September 10, 2022