telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ది హత్యే… రాజ్య సభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య కాదని కచ్చితంగా హత్యేనని రాజ్య సభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ప్రకటించారు. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డని అభిమానులు భావిస్తున్నా తరుణంలో సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఈ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తుకి కూడా అవకాశం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ ప్రకటించిన తరుణంలో.. తాజాగా సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించిన ప్రకారం.. సుశాంత్ తన మరణానికి ఉపయోగించిన క్లాత్, అతని మెడపై ఉన్న గుర్తుకు సరిపోకపోవడం, అలాగే అతని శరీరంపై అక్కడక్కడా గాట్లు వంటివి అనుమానాలకు కారణమైతే, మరణించిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, అలాగే సుశాంత్ ఉన్న రూమ్‌కి చెందిన డూప్లికేట్ కీ మిస్సవడం, సిమ్ కార్డుల మార్పు, సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, పనివాడి తప్పుడు వాంగ్మూలం వంటివి పరోక్షంగా అనుమానాలకు తావిస్తున్నాయని’ సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సుశాంత్ కి ఆర్థిక సమస్యలు కూడా లేవు కాబట్టి అతడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వామి ప్రకటించారు. ముంబై మూవీ మాఫియా ఈ హత్యను ఒక గొడవ కేసుగా చిత్రీకరించి, ఓ నటిని ఇందులో ఇరికించాలని చూస్తున్నట్లుగా ఉందని స్వామి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts