ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. విజయనగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలకు కూడు పెడితే… జగన్ పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతి నిర్మూలనపై జగన్ వి మాటలే తప్ప చేతలు లేవని అన్నారు.
వరుసగా టెండర్లను రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. ఇసుక విధానంపై కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటుపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు.


కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు