తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకర్గానికి కేసీఆర్ వస్తే సన్మానం చేస్తానని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కు తన అవసరం లేదని, కానీ తనకు మాత్రం ఆయనతో అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం సీఎం అవసరం ఉందని చెప్పారు.
కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు వేచి చూస్తానని తెలిపారు. ఆయన రాకపోతే మౌనంగా ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్ పై అనవరస వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు చెప్పానని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.