ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బిగ్బాస్ సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక రేపు (సెప్టెంబర్ 5న) బిగ్బాస్ స్టార్ట్ కాబోతుండడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే లెటేస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షో రేపు ప్రారంభం కాబోతుండడంతో ఈరోజే కంటెస్టెంట్లను హౌస్లోకి పంపుతున్నారు నిర్వహకులు. గత కొద్ది రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారంటైన్లో ఉన్న పార్టీసిపెంట్లను ప్రస్తుతం హౌస్లోకి ప్రవేశపెడుతున్నారు. ఈ సాయంత్రానికి కంటెస్టెంట్స్ బిగ్బాస్ హౌస్ ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రేపు సాయంత్రం బిగ్బాస్ ప్రసారం కానుంది. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేదానిపై కూడా స్పష్టత వచ్చేసింది.
బిగ్బాస్ హౌస్లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్
యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్లోకి వెళ్తున్నారు.
అయితే కొత్త లీస్ట్ ప్రకారం నటుడు విశ్వ, సింగర్ శ్రీరామచంద్ర పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. అనేది తెలియాల్సి ఉంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ వారానికి రూ. 40 వేలకు పైగా అందుకుంటున్నారని టాక్.
కాగా.. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు భారీగా టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుంది. ఆ తరువాత నాని హోస్ట్ గా తెరకెక్కిన సీజన్ 2, ఆపై నాగార్జున హోస్ట్ చేసిన 3, 4 సీజన్స్ కూడా ఒకదానిని మించేలా మరొకటి మంచి ఆదరణ రేటింగ్స్ దక్కించుకున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 పై కూడా అంతకుమించి ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.