బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా బిగ్బాస్ సీజన్-6 గ్రాండ్గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది
గాంధారీ… గాంధారీ అంటూ డ్యాన్స్తో సందడి చేసింది. తెలుగు ప్రేక్షకులకు కీర్తి భట్ అంటే తెలియదు కానీ.. భాను అంటే గుర్తుపడతారు.
‘కార్తీకదీపం’ సీరియల్ లో హిమ క్యారెక్టర్ తో బాగా ఫేమస్ అయింది కీర్తి. ఈ సీరియల్ కంటే ముందు ‘మనసిచ్చి చూడు’ అనే సీరియల్ లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది కీర్తి భట్.
ఈ సీరియల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బెంగుళూరు పుట్టిపెరిగిన ఈ కన్నడ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ మక్కువతోనే యాక్టింగ్లో శిక్షణ పొంది డాన్స్ కూడా నేర్చుకుంది.కన్నడలో మూడు సీరియల్స్, కొన్ని సినిమాలు చేసింది.
ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్లో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులతో పాటు అన్న, వదినలను కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఈమె ఓ అనాథను దత్తత తీసుకొని పెంచుకుంటుంది.
ఇవే విషయాలను హోస్ట్ నాగార్జునతో పంచుకొని ఎమోషనల్ గా మాట్లాడింది. జీవితంలో ఎన్నో కష్టాలను చూసిన కీర్తి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.