ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఆయన ప్రకటించారు.
“2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తోంది.
పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!” అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
‘బిగ్ అన్ వీల్’ అంటూ చేసిన ఈ పోస్టుకు అనే హ్యాష్ట్యాగ్లను జతచేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ హ్యాష్ట్యాగ్లు ప్రతిబింబిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, లోకేశ్ ప్రకటించిన ఆ సంస్థ ఏది? ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతోంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్