‘జానే మేరీ జానే మన్.. బచ్పన్ కా ప్యార్’ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుపరిచితమైన చత్తీస్గఢ్ బాలుడు సహ్దేవ్ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఛత్తీస్గఢ్లోని సొంతూరు అయిన సుక్మా జిల్లాకు మంగళవారం సాయంత్రం సహ్దేవ్ తండ్రితో కలిసి బైక్ మీద ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి కిందపడటంతో సహ్దేవ్కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాన్ని నడపుతున్న తండ్రికి స్వల్పంగా గాయపడ్డాడు.

సహ్దేవ్ను మొదట సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్దల్పూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సహ్దేవ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వర్, ఎస్పీ సునీల్ శర్మ సహ్దేవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సహ్దేవ్కు మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్ సహా అధికారులను ఆదేశించారు.

సుక్మా జిల్లాకు చెందిన సహ్దేవ్.. తరగతి గదిలో ‘జానే మేరీ జానే మన్.. బచ్పన్ కా ప్యార్’ పాట పాడగా.. టీచర్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. పలువురు సెలబ్రెటీలు సైతం సహ్దేవ్ను ప్రశంసించారు.

