telugu navyamedia
Uncategorized

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు

ayyannapatrudu on tdp drastic loss

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న సందర్భంగా ఆయన కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేశారని వైసీపీ నాయకుడు వెంకట్రావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇటీవల అయ్యన్నపాత్రుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, ఇటీవల జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శల్లో విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఉన్నాయంటూ పోలీసులు ఆయనపై ఐపీసీలోని 153ఏ, 500, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts