పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28న పూరీ బర్త్డే కావడంతో ఆ రోజుతో పాటు సెప్టెంబర్ 27, 29 తేదీలలో చిత్రం థియేటర్స్లో ప్రదర్శితం కానున్నట్టు సినిమా కో ప్రొడ్యూసర్ ఛార్మి పేర్కొంది. ఏపీ, తెలంగాణలలో మొత్తం 10 థియేటర్స్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన తర్వాతి సినిమాకి సంబంధించి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ 28న పూరీ జగన్నాథ్ బర్త్డే కావడంతో ఆయనొక మంచి నిర్ణయం తీసుకున్నారు. 20 మంది దర్శకులు, కో డైరెక్టర్స్కి ఆర్ధిక సాయం చేస్తానని ప్రకటన ద్వారా తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ప్రతి ఏడాది ఇలానే సాయం చేస్తానని పూరీ పేర్కొన్నారు. సినిమాతో మమేకమై ఉండే ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని భావించిన పూరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా పూరీ ఇలాంటి సాయాలు చేసారని బ్రహ్మాజీ తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
Helping Hand by @purijagan, @Charmmeofficial #HBDpurijagan pic.twitter.com/Iez18JWrCH
— BARaju (@baraju_SuperHit) September 27, 2019
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్