వివి వినాయక్ దర్శకుడిగా కెరీర్లో వెనుకబడిన టైంలో నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పెట్టి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ‘శీనయ్య’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ ఆపేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రష్ ను చూసి వినాయక్ అసంతృప్తి వ్యక్తం చేసాడని , అలాగే కథలో గందరగోళంతో వినాయక్ స్వయానా దిల్ రాజు కి చెప్పి షూటింగ్ ఆపేశాడని అంటున్నారు. మరో వైపు దిల్ రాజే కావాలని ‘శీనయ్య’ షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ‘శీనయ్య’ సినిమా వస్తుందో రాదో తెలియదని కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్స్ రావడం ఆలస్యం వినాయక్కి యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, అందుకే హీరోగా నటించిన ‘శీనయ్య’ రిలీజ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకుంటున్నారు. అయితే మెగాస్టార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్న మళయాళీ హిట్ ‘లూసిఫర్’ని రీమేక్ చెయ్యబోతున్నాడు వినాయక్.
previous post